జయలలిత అక్రమాస్తుల కేసు విచారణపై స్టే విధించాలి!
తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు అక్రమాస్తుల కేసుతో తలనొప్పి తప్పేలా లేదు. ఈ అక్రమాస్తుల కేసు విచారణ తీరుపై డీఎంకే జనరల్ సెక్రెటరీ కె.అన్బగళన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసులో విచారణపై స్టే విధించాలని, ఈ కేసులో వాదిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలో చిత్తశుద్ధి లేదని, పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. వెంటనే పిటిషన్ను స్వీకరించిన కోర్టు, విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.