డొమెస్టిక్ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు : రాజ్యసభలో కాంగ్రెస్ రగడ!
రాజ్యసభలో కాంగ్రెస్ తెలంగాణ పార్లమెంటు సబ్యులు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం అంశంపై రగడ చేసారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయం జరుగుతుండగానే తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు.
శంషాబాద్ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరునే కొనసాగించాలన్న అంశంపై చర్చించాలని ఆనంద్ శర్మ రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీని కోరారు. ఇదే అంశంపై ముందుగా నోటీసు ఇవ్వాలని ఛైర్మన్ సూచించారు.
కానీ కాంగ్రెస్ ఎంపీలు అప్పటికప్పుడే చర్చ జరపాలని పట్టుపట్టారు. ఆ మొత్తం సమయం అంతా ఎంఏ ఖాన్, వీ హనుమంతరావు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, జేడీ శీలం ప్లకార్డులు ప్రదర్శించారు. నోటీసు లేకుండా చర్చకు అనుమతించడం సాధ్యం కాదంటూ చైర్మన్ సభను రెండుసార్లు వాయిదా వేశారు.