గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 12 మార్చి 2018 (11:29 IST)

తప్పతాగి కారు నడిపిన యువతి.. ఇద్దరు స్టూడెంట్లు దుర్మరణం.. ఎక్కడ?

మద్యం సేవించి ఓ యువతి కారు నడపడంతో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలోని ముఖర్జీ నగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మద్యం మత్తులో వున్న యువతి కారుపై నియంత్రణ కోల్పో

మద్యం సేవించి ఓ యువతి కారు నడపడంతో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలోని ముఖర్జీ నగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మద్యం మత్తులో వున్న యువతి కారుపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మరణించగా, డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు యువతులు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు చెప్పారు. 
 
హడ్సన్ లైన్స్‌ వద్ద ఉన్న ఓ ట్రాఫిక్ సిగ్నల్ స్తంభాన్ని తప్పతాగి బండి నడిపిన యువతి ఢీకొట్టింది. అందులో ప్రయాణిస్తున్న 20 ఏళ్ల ప్రాయంలో ఉన్న ఇద్దరు స్టూడెంట్లు రితేశ్ దహియా, సిద్దార్థ్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
 
స్తంభాన్ని ఢీకొట్టిన తర్వాత కారు బోల్తా పడిందని.. డీసీపీ అస్లాం ఖాన్ చెప్పారు. ప్రాథమిక చికిత్స అనంతరం నిందితురాలిని అరెస్టు చేశామని అస్లాం ఖాన్ తెలిపారు. తప్పతాగి బండి నడిపిన యువతికి లెర్నల్ లైసెన్స్ వుంది. వారంతా నోయిడాలోని అమితీలో పార్టీ చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.