శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 1 నవంబరు 2017 (12:21 IST)

డస్ట్‌బిన్‌కు పూజలు చేసిన బీహార్ ప్రజలు.. (వీడియో)

ప్రపంచంలో అత్యంత భక్తిగల దేశం మనదే. భక్తిలో ప్రజలు మూఢులుగా మారిపోతున్నారు. పంచభూతాలను.. వృక్షాలను ఆరాధించే మన భారతీయులు.. తాజాగా ఓ డస్ట్ బిన్‌కు కూడా పూజలు చేశారు. పశుపక్ష్యాదులు ప్రకృతిని ఆరాధించే భ

ప్రపంచంలో అత్యంత భక్తిగల దేశం మనదే. భక్తిలో ప్రజలు మూఢులుగా మారిపోతున్నారు. పంచభూతాలను.. వృక్షాలను ఆరాధించే మన భారతీయులు.. తాజాగా ఓ డస్ట్ బిన్‌కు కూడా పూజలు చేశారు. పశుపక్ష్యాదులు ప్రకృతిని ఆరాధించే భారతీయులు.. బీహార్‌లోని ఓ గుడిలో కంగారు బొమ్మ ఆకారంలోని చెత్త కుండీని ఉంచగా, అక్కడికి వచ్చిన మహిళలు దానికి పూజలు చేశారు. 
 
ఈ వీడియో తీసిన ఎవరో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. అదీ కాస్త వైరల్ అయ్యింది. డస్ట్ బిన్‌కు పసుపు, కుంకుమలు అద్ది, ఆపై చెత్త వేయాల్సిన చోట పూలు సమర్పిస్తూ, జలాభిషేకం చేసేశారు. అభివృద్ధి చెందుతున్న దేశమైన భారత్‌లో ఇంకా ఇలాంటి అమాయకపు ప్రజలు వున్నారని నెటిజన్లు అంటున్నారు. ఈ వీడియోను మీరూ చూడండి.