మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (15:58 IST)

2014 -15 ఆర్థిక సర్వే... లోక్‌సభలో ప్రవేశపెట్టిన అరుణ్ జైట్లీ..!

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ 2014-15 సంవత్సరానికి గాను ఆర్థిక సర్వేను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. భారత్‌లో మేక్ ఇన్ ఇండియాతో పాటు దేశ స్ధూల జాతీయోత్పత్తి (జీడీపీ)పై దృష్టి పెట్టినట్లు ఈ సర్వేలో పేర్కొన్నారు. 
 
అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే ముఖ్యాంశాలు: 
- 2015-16 సంవత్సరానికి గాను ఆర్ధిక వృద్ధిరేటు 8.1 శాతం నుంచి 8.5 శాతం మధ్య ఉంటుంది. 
- 14వ ఆర్ధిక సంఘం నివేదిక అమలుతో రాష్ట్రాలకు మరిన్ని నిధులు. 
- 2014-15 సంవత్సరానికి గాను ఆహారధాన్యాల ఉత్పత్తి 257.07 మిలియన్ టన్నులు. 
- దేశ ఆదాయం పెంచేందుకు ప్రాధాన్యం. 
- లక్ష మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా సౌరశక్తి ప్రాజెక్టులు. 
- భారీ సంస్కరణలు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. 
- వ్యవసాయ ఉత్పత్తులు అమ్మేందుకు జాతీయ స్ధాయిలో ఉమ్మడి మార్కెట్.
- ప్రభుత్వ పథాకలు అర్హులకే చేరాలంటే 'జామ్' కీలకం. 
- JAM అంటే జన్ ధన్ యోజన, ఆధార్ మొబైల్ నెంబర్. 
- ఈ ఆర్ధిక సంవత్సరంలో సాప్ట్ వేర్ ఉత్పత్తులు 12 శాతం నుంచి 14 శాతానికి పెరిగే అవకాశం. 
- దేశంలో పర్యాటక రంగం మంచి పురోగతిలో ఉంది. 2014లో విదేశీ పర్యాటకుల సంఖ్య 7.1 శాతానికి పెరిగింది. 
-  సాంప్రదాయ మార్కెట్ నుంచి ఆధునిక రిటైల్ మార్కెట్‌కు వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. 
-  ఆన్‌లైన్ మార్కెట్ పోత్సాహాంతో పాటు వినియోగదారుల హక్కుల రక్షణకు చర్యలు తీసుకుంటాం. 
- మహిళా అక్షరాస్యతతో పాటు విద్యాభివృద్ధిని ప్రోత్సహించేందుకు చర్యలు.