శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 22 అక్టోబరు 2014 (11:31 IST)

ఎన్నికల మేనిఫెస్టో.. ఓ భగవద్గీత : కేబినెట్ సహచరులతో నరేంద్ర మోడీ!

ఎన్నికలకు ముందు విడుదల చేసే మేనిఫెస్టోలు భగవద్గీత వంటిదని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించారు. ఆయన తన కేబినెట్ సహచరులకు ఢిల్లీ విందు ఇచ్చిన విషయం తెల్సిందే. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు పట్ల చిత్తశుద్ధి కలిగి ఉండాలంటున్నారు. ఎన్నికల మేనిఫెస్టో పవిత్రమైన భగవద్గీత వంటిదన్నారు. 
 
ఆ మేనిఫెస్టోను ప్రతిరోజూ చదవాలని, తద్వారా తాము ఎంతమేర పనిచేశామన్న విషయం అంచనాకు రావొచ్చన్నారు. భవిష్యత్ ప్రణాళికల విషయమై ఒకరి ఆలోచనలు మరొకరితో పంచుకోవాలని ప్రధాని సూచించారు. తద్వారా, క్యాబినెట్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు.