కేరళలో దారుణం... గుజరాత్ యువతిని తొక్కి చంపిన ఏనుగు
కేరళలోని ఇరుత్తుకనమ్ లో దారుణం జరిగింది. గుజరాత్ నర్మద జిల్లాకు చెందిన 27 ఏళ్ల యువతిని ఓ ఏనుగు తొక్కి చంపేసింది. వివరాల్లోకి వెళితే... దీపావళి పండుగ సందర్భంగా గుజరాత్ నర్మద జిల్లా నుంచి కేరళ రాష్ట్రంలో పర్యటించేందుకు ఓ బృందం వచ్చింది.
ఈ బృందం మంగళవారంనాడు ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో ఉన్న ఓ ఏనుగుల సవారీ కేంద్రానికి వెళ్లి అక్కడ ఏనుగులతో ఫోటోలు దిగేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ యువతి ఏనుగు పక్కనే నిలబడి ఫోటో తీయించుకునేందుకు ప్రయత్నించగా ఆ ఏనుగు ఆమెను తొండంతో లాగి కింద పడేసింది.
అంతటితో ఊరుకోకుండా ఆమె శరీరంపై కాలు వేసి తొక్కేసింది. దాంతో ఆ యువతి అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో పర్యటకు వచ్చినవారంతా షాక్ కు గురయ్యారు.