శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : గురువారం, 29 సెప్టెంబరు 2016 (13:23 IST)

అమ్మపై దాడి చేసిన మహిళపై కసి తీర్చుకునేందుకు స్పైడర్‌మెన్‌గా మారిన 20 యేళ్ల కుర్రోడు... ఎలా?

తల్లిని అవమానించారన్న కోపంతో ఓ యువకుడు కత్తి తీసుకుని దొడ్డిదారిలో ప్లానటేరియా కాంప్లెక్స్ అపార్ట్‌మెంట్ మూడో అంతస్తుకు చేరుకున్నాడు. స్పైడర్‌ మ్యాన్‌లా మారి కలకలం సృష్టించిన ఘటన ముంబైని భయందర్‌(పశ్చి

తల్లిని అవమానించారన్న కోపంతో ఓ యువకుడు కత్తి తీసుకుని దొడ్డిదారిలో ప్లానటేరియా కాంప్లెక్స్ అపార్ట్‌మెంట్ మూడో అంతస్తుకు చేరుకున్నాడు. స్పైడర్‌ మ్యాన్‌లా మారి కలకలం సృష్టించిన ఘటన ముంబైని భయందర్‌(పశ్చిమ) ప్రాంతంలో జరిగింది. 
 
ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే... ధోనీ గోపాల్ (20) అనే యువకుడు రిజ్వీ కాలేజీ విద్యార్థి. భయాందర్ పశ్చిమ ప్రాంతంలో నివాసముంటున్నాడు. ఈ నేపథ్యంలో గోపాల్ తల్లికి, ఎదురింటి మహిళకు మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో సదరు మహిళ గోపాల్ తల్లిని లాగి పెట్టి కొట్టింది. దీంతో గోపాల్‌ కసితో రగిలిపోయాడు. ఇంట్లో ఉన్నకత్తిని తీసుకుని మహిళ ఉంటున్న అపార్ట్‌మెంట్‌ వద్దకు వెళ్లాడు. 
 
అపార్ట్ మెంట్‌లోని సదరు మహిళ ఇంటి డోర్ కొట్టాడు. ఎంతసేపటికి ఆ మహిళ తలుపు తీయలేదు. తీవ్ర ఆవేశంలో ఉన్న ఆ యువకుడు వెళ్లిపోకుండా... ప్యారాపెట్ వైపు నుంచి ఎక్కుతూ మూడో అంతస్తులో ఉన్న ఆ మహిళ ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లోకి వెళ్లేందుకు వీలుకాకపోవడంతో అదే కత్తితో కిటికీని ధ్వంసం చేసి.. కిందికి వచ్చాడు. ఈ ఘటనను గమనించిన అపార్ట్‌మెంట్‌ వాసులు గోపాల్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్‌గా మారింది.