బీహార్ మాజీ ముఖ్యమంత్రి రామ్ సుందర్ దాస్ ఇకలేరు.!
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, జేడీయూ సీనియర్ నేత రామ్ సుందర్ దాస్ (95) కన్నుమూశారు. గత కొంత కాలంగా వృద్ధాప్యకారణాలతో అనారోగ్యంతో బాధపడుతున్న రామ్ సుందర్ దాస్ ఇంట్లోనే వైద్యం పొందుతూ వచ్చారు. ఈ స్థితిలో వైద్యం ఫలించక శుక్రవారం ఉదయం ఆయన తుదిశ్వాశ విడిచినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
రామ్ సుందర్ దాస్ మృతి పట్ల బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన మృతదేహానికి పుష్పాలతో నివాళులర్పించారు. రామ్ సుందర్ కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన భార్య గతంలోనే మృతి చెందారు.