గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 31 ఆగస్టు 2014 (14:43 IST)

కేరళ గవర్నర్‌గా సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టీస్ సదాశివం!

కేరళ రాష్ట్ర గవర్నర్‌గా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సదాశివం నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆయన పేరును సిఫార్సు చేసింది. ఇక రాష్ట్రపతి భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయి. 
 
ఈ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత షీలా దీక్షిత్ ఇటీవలే తన  పదవికి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. దీంతో ఆమె స్థానంలో సదాశివంను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంపిక చేశారు. 
 
ఇదే జరిగితే న్యాయ వ్యవస్థలో కీలక పదవులు అలంకరించిన ప్రముఖులు కూడా గవర్నర్ గిరీ చేపట్టేందుకు సదాశివం బాటలు వేసినట్టేనన్న విశ్లేషణలు కొనసాగుతున్నాయి. యూపీఏ హయాంలో తొమ్మిది నెలల పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన సదాశివం, 2జీ, కోల్ గేట్ తదితర కేసులపై వేగంగా దర్యాప్తు జరిగేలా చర్యలు చేపట్టారు. అంతేకాక పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను విచారించిన సదాశివం సంచలన తీర్పులు వెలువరించిన విషయం తెల్సిందే.