శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 22 జనవరి 2015 (11:19 IST)

ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకుని హోటల్లో అత్యాచారం చేశాడు.. ఎక్కడ..? ఎప్పుడు?

యువతులు ఏదో ఒక రీతిలో మోసపోతున్నారు. తాజాగా ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతి ఏకంగా హత్యకు గురైంది. ఆ వివరాలను పరిశీలిస్తే.. ఫేస్బుక్ ద్వారా తనను తాను పరిచయం చేసుకున్నాడు ఓ ప్రబుద్ధుడు.. పలుమార్లు మాటలు కలిశాయి. ఒకరి భావాలను ఒకరు పంచుకున్నారు. ఆపై నేరుగా ప్రత్యక్షమయ్యాడు.. మాటు చెప్పాడు. ప్రేమించానన్నాడు. నమ్మిన ఓ యువతిని హోటల్ కు తీసుకెళ్ళి అత్యాచారం చేశాడు. ఆపై అకౌంట్ క్లోజ్... ఎక్కడ? ఎప్పుడు? ఎలా..? రండీ చదవండి.
 
రాజన్ మల్హోత్రా (22) అనే వ్యక్తి 19 ఏళ్ల యువతికి ఫేస్బుక్లో పరిచయమయ్యాడు. ఆపై ఫెన్ బుక్కులోనే ఎన్నెన్నో కహానీలు వినిపించాడు. ఎన్నెన్నో చిత్రాలు చూపించాడు. ఓ రోజు నేరుగా తన ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ప్రేమన్నాడు.. అమ్మాయిని చూసి ఓకే. అనుకున్నాడు. పెళ్ళి విషయం వచ్చినా సరే అన్నాడు. అయితే లోపల మాత్రం ఎలాగైనా ఆమెతో ఓ రాత్రయినా గడపాలనుకున్నాడు.
 
మాట్లడుకోవడానికి హోటల్ కు రమ్మన్నాడు. ఆ అమ్మాయిని గుర్గావ్లోని ఓ హోటల్కు వచ్చింది. తీరా అక్కడి వచ్చాక మాట మార్చాడు. ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరుగుతుండగానే అత్యాచారం చేశాడు. మళ్లీ కాళ్ళా వేళ్ళ పడడంతో ఆమె కరిగి పోయింది. ఆపై రాజన్ తన ఫేస్బుక్ అకౌంట్ను తొలగించి, ఫోన్ నెంబర్ కూడా మార్చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.