బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 19 నవంబరు 2016 (13:41 IST)

బిర్యానీ తినేందుకు వెళ్లాడు.. బలైపోయాడు.. చెట్టు కొమ్మలు బాలుడిపై పడిపోవడంతో?

బిర్యానీ తినేందుకు వెళ్ళిన ఓ బాలుడు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఢిల్లీకి చెందిన ఓ ఏడేళ్ల బాలుడు స్నేహితులతో కలిసి జందేవాలన్ సమీపంలో ఉన్న ఫైజ్ రోడ్డులోని ఎంసీడీ కాంప్లెక్స్‌కు వెళ్లాడు. అయితే

బిర్యానీ తినేందుకు వెళ్ళిన ఓ బాలుడు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఢిల్లీకి చెందిన ఓ ఏడేళ్ల బాలుడు స్నేహితులతో కలిసి జందేవాలన్ సమీపంలో ఉన్న ఫైజ్ రోడ్డులోని ఎంసీడీ కాంప్లెక్స్‌కు వెళ్లాడు. అయితే కార్పోరేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల ఆ నిండు ప్రాణం బలైపోయింది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన ఓ ఏడేళ్ల బాలుడు స్నేహితులతో కలిసి జందేవాలన్ సమీపంలో ఉన్న ఫైజ్ రోడ్డులోని ఎంసీడీ కాంప్లెక్స్‌లో బిర్యానీ తినడానికి వెళ్లాడు. 
 
అదే సమయంలో.. బిర్యానీ షాపును ఆనుకుని ఉన్న ఎంసీడీ కాంప్లెక్స్ గోడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నిర్మాణ పనులకు అడ్డుగా ఉన్న ఓ చెట్టును తొలగించడానికి ప్రయత్నించారు అధికారులు. దీంతో చెట్టు కొమ్మలన్ని బిర్యానీ షాపుపై ఒరిగాయి. ఆపై అప్పటికే స్వల్పంగా ధ్వంసమై ఉన్న గోడ కాస్త... బిర్యానీ తింటున్న బాలుడితో పాటు పలువురిపై కూలిపోయింది. ఈ దుర్ఘటనలో బాలుడు అక్కడిక్కడే చనిపోగా.. మరో ఏడుగురు గాయపడ్డారు.
 
ఈ ఘటనలో బాధాకరమైన విషయం ఏమిటంటే? చనిపోయిన బాలుడి తండ్రి కూడా ఆ గోడ నిర్మాణం కోసం వచ్చిన కూలీల్లో ఒకడు కావడమే. కొడుకు చావును జీర్ణించుకోలేక ఆ తండ్రి గుండెలవిసేలా రోధించాడు.