గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 10 అక్టోబరు 2017 (17:19 IST)

సునారియా జైలులో డేరా బాబా... 45 రోజుల తర్వాత కలిసిన కుటుంబీకులు

సాధ్వీలపై అత్యాచారం కేసులో చిప్పకూడు తింటున్న డేరాబాబా చూసేందుకు ఆతని కుటుంబీకులు పెద్దగా ఆసక్తి చూపలేదు. డేరాబాబా సన్నిహితురాలు హనీప్రీత్ సింగ్ వద్ద పోలీసులు విచారణ జరుపుతున్న నేపథ్యంలో.. గుర్మీత్ కు

సాధ్వీలపై అత్యాచారం కేసులో చిప్పకూడు తింటున్న డేరాబాబా చూసేందుకు ఆతని కుటుంబీకులు పెద్దగా ఆసక్తి చూపలేదు. డేరాబాబా సన్నిహితురాలు హనీప్రీత్ సింగ్ వద్ద పోలీసులు విచారణ జరుపుతున్న నేపథ్యంలో.. గుర్మీత్ కుటుంబీకులు ఆయనను రెండో సారి జైలులో కలిశారు. సెప్టెంబర్ నెల 15వ తేదీన డేరా బాబాను ఆతడి తల్లి కలిసింది. తాజాగా శిక్షపడిన 45 రోజుల తర్వాత ఇతర కుటుంబీకులు అతడిని చూసేందుకు వచ్చారు. 
 
డేరా బాబా అత్యాచారం కేసుల్లో శిక్ష ప‌డటంతో, రోహ్‌త‌క్‌లోని సునారియా జైల్లో మ‌గ్గుతున్న‌ సంగతి తెలిసిందే. బాబా గుర్మీత్ రామ్ ర‌హీమ్ సింగ్‌ను కలిసేందుకు త‌ల్లి న‌సీబ్ కౌర్‌, కుమారుడు జ‌స్వంత్‌, కుమార్తె అమ‌ర్‌ప్రీత్‌, అల్లుడు షాన్‌-ఏ-మీత్‌లు వ‌చ్చారు. 
 
తనను కలవడానికి వచ్చే పదిమంది పేర్లను డేరా బాబా పోలీసులకు ఇచ్చాడు. అందులో తొలిపేరు హనీప్రీత్‌దే. మిగిలినవి అతని కుటుంబీకుల పేర్లు. ఈ నేపథ్యంలో తనను కలిసేందుకు వచ్చిన కుటుంబీకులతో డేరా బాబా అరగంట మాట్లాడినట్లు సమాచారం.