మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 19 ఆగస్టు 2016 (10:40 IST)

ముగ్గురు కుమార్తెలను చంపి.. శవాల పక్కనే నిద్రపోయిన తండ్రి..ఎక్కడ..?

తమిళనాడు రాష్ట్రంలో దారుణం జరిగింది. భార్యపై కోపం పెంచుకున్న ఓ వ్యక్తి మద్యం మత్తులో తన ముగ్గురు కుమార్తెలకు విషమిచ్చి చంపేసి.. రాత్రంతా శవాల పక్కనే పడుకుని నిద్రపోయాడు.

తమిళనాడు రాష్ట్రంలో దారుణం జరిగింది. భార్యపై కోపం పెంచుకున్న ఓ వ్యక్తి మద్యం మత్తులో తన ముగ్గురు కుమార్తెలకు విషమిచ్చి చంపేసి.. రాత్రంతా శవాల పక్కనే పడుకుని నిద్రపోయాడు. ఈ ఘటన తిరునెల్వేలి జిల్లాలో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
తిరునల్వేలి జిల్లా తరువై అమ్మన్ కోవిల్‌కు చెందిన రాజశేఖర్‌ (29), మేఘల (26) దంపతులకు ముత్తుసెల్వి (8), కావ్య (6), ఆరతి (3) అనే ముగ్గురు కుమార్తెలున్నారు. భవన నిర్మాణ కూలీగా పని చేస్తున్న రాజశేఖర్‌ మద్యానికి బానిసయ్యాడు. రోజూ సంపాదించిన డబ్బుతో పీకల దాకా తాగి రాత్రిపూట ఇంటికొచ్చి భార్యతో తగాదా పడుతుండేవాడు. తాగుడు మానుకోవాలని భార్య హితవు చెప్పినా పట్టించుకోలేదు. 
 
ఈ పరిస్థితుల్లో బుధవారం రాత్రి ఎప్పటిలా మద్యం సేవించి ఇంటికి వచ్చిన రాజశేఖర్‌ భార్యతో మళ్లీ గొడవపడ్డాడు. ఉన్నట్టుండి ఆమెను గొంతునులిమి చంపేందుకు ప్రయత్నించడంతో ఆమె పక్కనే ఉన్న పుట్టింటికి పారిపోయింది. భార్య తన నుంచి తప్పించుకెళ్లిందన్న కోపంతో రాజశేఖర్‌ నిద్రపోతున్న ముగ్గురు కుమార్తెలకు కూల్‌డ్రింక్స్‌లో విషం కలిపి బలవంతంగా తాగించాడు. 
 
కాసేపటికి ఒకరి తర్వాత ఒకరు వరుసగా.. ఆ ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం మద్యంమత్తులో ఉన్న రాజశేఖర్‌ గమనించకుండా ఆ ముగ్గురి శవాల పక్కనే పడుకున్నాడు. తెల్లవారి మేఘన వచ్చి చూడగా, ముగ్గురు కుమార్తెలు విగతజీవులై పడివున్నారు. దీనిపై స్థానిక పోలీసులకు సమాచారం చేరవేయగా వారు ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాలను స్వాధీనం చేసుకుని రాజశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు.