మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 16 నవంబరు 2017 (13:40 IST)

కన్నతండ్రే అత్యాచారం చేశాడు.. గర్భం ధరిస్తే.. మారుతల్లి ఏం చేసిందంటే?

కన్నతండ్రే కన్నకూతురు పట్ల కీచకుడిగా మారాడు. కన్నబిడ్డ అని కనికరం లేకుండా ఆమెపై అత్యాచారానికి పాల్పడటమే గాకుండా.. ఆపై లక్ష రూపాయలకు వ్యభిచార గృహానికి విక్రయించేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో వెలుగు

కన్నతండ్రే కన్నకూతురు పట్ల కీచకుడిగా మారాడు. కన్నబిడ్డ అని కనికరం లేకుండా ఆమెపై అత్యాచారానికి పాల్పడటమే గాకుండా.. ఆపై లక్ష రూపాయలకు వ్యభిచార గృహానికి విక్రయించేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. 16ఏళ్ల బాలిక తల్లి 2010లోనే ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో తండ్రిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. తండ్రి మూడేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి విడుదలై వచ్చాక మళ్లీ అదే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మరో మహిళను పెళ్లాడినా నిత్యం కూతురిపై కూడా అత్యాచారం చేశాడు.
 
బాలిక గర్భం దాల్చడంతో మారుతల్లి మాత్రలు తినిపించేదని బాధిత బాలిక పోలీసులకు చెప్పింది. అనంతరం 2016లో సాక్షాత్తూ తండ్రి కూతురిని లక్షరూపాయలకు వ్యభిచార గృహానికి విక్రయించాడు. వ్యభిచార గృహంలో మగ్గుతున్న బాలికకు పోలీసులు దాడి చేసి కాపాడి సంరక్షణా కేంద్రానికి పంపారు.  ఈ ఘటనపై పోలీసులు తండ్రి, మారుతల్లి, వ్యభిచార గృహం నిర్వాహకురాళ్లను అరెస్టు చేశారు.