శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2015 (09:10 IST)

బీజేపీ ఎమ్మెల్యేపై కాల్పులు.. తృటిలో తప్పిన ప్రమాదం... ఎక్కడ?

దుండగులు రాజస్థాన్‌లో ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డారు. కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తు బుల్లెట్లు తగలలేదు. ఆయన అప్రమత్తమవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. 
 
రాజస్థాన్ దౌసాలోని మహ్వా నియోజవర్గానికి చెందిన ఎమ్మెల్యే ఓంప్రకాశ్ హుడ్లా ఏవో పనుల్లో తన ఇంట్లో ఉండగా ఓ ముగ్గురు వ్యక్తులు ఇంటి ప్రాంగణంలోకి చొరబడి కిటికిలో నుంచి కాల్పులు జరిపారు. 
 
అయితే, అదృష్టవశాత్తూ ఆయనకు ఒక్క బుల్లెట్ కూడా తగలలేదు. ఆయన వెంటనే అలారం మోగించడంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.