బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 29 మే 2016 (11:19 IST)

భారత్‌లో బుల్లెట్ ట్రైన్ పరుగులు... బరేలీ-మొరాదాబాద్‌ల మధ్య ట్రయల్ రన్

భారత్‌లో బుల్లెట్ రైల్ పరుగు పెట్టింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ-మొరాదాబాద్‌ స్టేషన్ల ఆదివారం ట్రయల్ రన్ నిర్వహించారు. ఇందుకోసం స్పెయిన్‌‌లో తయారైన టాల్గో కోచ్‌ల సెన్సర్లను రైల్వే అధికారులు పరీక్షించారు. 
 
ఈ ట్రయల్ రన్ జూన్‌ 12 వరకు కొనసాగుతుంది. 'టాల్గో బోగీలకు ఏర్పాటు చేసిన అసంఖ్యాక సెన్సర్లు సరిగ్గా పనిచేస్తున్నదీ, లేనిదీ పరీక్షించాలని రైల్వే బోర్డు ఆదేశించింది. పరీక్ష నిర్వహించాం' అని ఓ అధికారి తెలిపారు. ఈ కోచ్‌లను భారత రైలింజన్‌తోనే నడిపినట్టు వివరించారు. 
 
ఆదివారం వేగానికి సంబంధించిన పరీక్షలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని ఇజ్జతనగర్‌ - భోజిపురి స్టేషన్లమధ్య నిర్వహించిన ఈ పరీక్ష విజయవంతమైన విషయం తెల్సిందే.