గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 20 సెప్టెంబరు 2014 (14:07 IST)

తీహార్ జైలు: 17 రోజుల్లో ఐదుగురు ఖైదీలు మృతి!

తీహార్ జైలులో పరిస్థితులు నానాటికీ దిగజారిపోతున్నాయి. ఈ నెల 2 నుంచి గురువారం దాకా కేవలం 17 రోజుల వ్యవధిలో ఐదుగురు ఖైదీలు మృత్యువాత పడ్డారు. అది కూడా ఏ అనారోగ్యం కారణంగానో అయితే, అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 
 
ఐదుగురూ అనుమానాస్పద స్థితిలోనే మృత్యువాతపడ్డారు. తోటి ఖైదీల చేతిలో దాడికి గురై మరణించిన ఓ ఖైదీ ఉదంతం కూడా ఈ ఐదింటిలో ఒకటి. దీంతో ఢిల్లీ హైకోర్టు, తీహార్ జైలు పరిస్థితులపై దృష్టి సారించింది. జైలులో చోటుచేసుకున్న మరణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.