డివైడర్ను ఢీకొన్న జీప్.. ఐదుగురు కర్నూలు వాసులు దుర్మరణం..
కర్ణాటకలోని హుబ్లీ రైల్వే గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జీపు టైరు పేలి అదుపుతప్పడంతో రోడ్డు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. చనిపోయినవారు కర్నూలు జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు.
మృతుల్లో ఇస్మాయిల్ (35), సద్దాం (47), అమీర్ (14), సుభాని (37), చలపతి (40) అని తెలిసింది. వారంతా కర్నూలు నుంచి గోవా వెళుతుండగా ఈ ప్రమాదం బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.