బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : శుక్రవారం, 29 మే 2015 (08:42 IST)

అస్సాంలో బాలుడి నరబలి.. తేయాకు తోటలో విగ్రహారాధన.. చితకబాదిన గ్రామస్తులు

మాయలు, మంత్రాలు, తంత్రాలు, నరబలులు తారా స్థాయిలోని మూఢ విశ్వాసం..  ఈ విశ్వాసానికి ఓ ఐదేళ్ళ బాలుడు బలయ్యాడు. అస్సాంలోని ఓ తేయాకు తోటలో బాలుడి తలను తెగనరికి విగ్రహారాధన చేసిన దుండగులు సంఘటన వెలుగులోకి వచ్చింది. అనుమానం ఉన్న వ్యక్తిని గ్రామస్తులు చితకబాదారు. వివరాలిలా ఉన్నాయి. 
 
సోనిత్ పూర్ జిల్లాలోని ఓ తేయాకు తోటలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. అదే గ్రామంలో ఓ బాలుడు కనిపించకుండా పోయాడు. అయితే తేయాకు తోటలో ఓ ఐదేళ్ల బాలుడి తలను నరికివేశారు. మొండెం నుంచి పూర్తిగా వేరు చేశారు. దీనిని గ్రామస్తులు గుర్తించారు. ఈ దారుణానికి పాల్పడినట్లుగా అనుమానించిన ఓ వ్యక్తిని గ్రామస్థులు చితక్కొట్టారు. 
 
పోలీసులు దీనిపై స్పందిస్తూ ఘటన జరిగిన చోట కొన్ని విగ్రహాలు లభించాయని, దాని ప్రకారం తేయాకు తోటలో ఎవరో కావాలనే ఆ బాలుడిని నరబలి పేరిట హతమార్చి ఉండొచ్చని చెప్తున్నారు. బాలుడికి సంబంధించిన వారు తీవ్రంగా విలపిస్తున్నారు.