శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 24 సెప్టెంబరు 2016 (11:24 IST)

తమిళనాడులో మరో ఉచితం... బస్టాండ్లు, మాల్స్‌లో 'అమ్మ వైఫై'

తమిళనాడులో మరో ఉచితం అమల్లోకి వచ్చింది. ఇప్పటికే మంచి నీటి నుంచి సిమెంట్ వరకూ, ఔషధాల నుంచి భోజనం వరకూ కొన్ని అతి తక్కువ ధరకూ, మరికొన్ని ఉచితంగా అందిస్తూ, ఎన్నో 'అమ్మ' పథకాలను ప్రారంభించిన తమిళనాడు సర్

తమిళనాడులో మరో ఉచితం అమల్లోకి వచ్చింది. ఇప్పటికే మంచి నీటి నుంచి సిమెంట్ వరకూ, ఔషధాల నుంచి భోజనం వరకూ కొన్ని అతి తక్కువ ధరకూ, మరికొన్ని ఉచితంగా అందిస్తూ, ఎన్నో 'అమ్మ' పథకాలను ప్రారంభించిన తమిళనాడు సర్కారు, తాజాగా యువతకు దగ్గరయ్యేలా ఉచిత వైఫే సేవలు కల్పించనుంది. 
 
రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన పెద్ద బస్టాండ్లు, మాల్స్ లో 'అమ్మ ఉచిత వైఫై' సెంటర్లను ప్రారంభించాలని నిర్ణయించింది. పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తొలి దశలో 50 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. 
 
హైయ్యర్ సెకండరీ, కాలేజ్ విద్యాభ్యాసం చేస్తున్న వారికి కూడా ఉచిత ఇంటర్నెట్‌ను అందించనున్నామని తెలిపింది. తొలిదశలో 50 పాఠశాలల్లో రూ.10 కోట్ల వ్యయంతో వైఫై టవర్లు ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొంది. ఇందుకోసం షోలింగనల్లూర్ ప్రాంతంలో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణముండే ఇంటిగ్రేటెడ్ ఐటీ కాంప్లెక్స్‌ను రూ.80 కోట్లతో నిర్మించేందుకు ఆదేశాలు జారీ చేసింది.