గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 7 అక్టోబరు 2015 (15:26 IST)

తన కోర్కెకు లొంగలేదని యువతిని గొడ్డలితో నరికి చంపిన మృగాడు!

రాజస్థాన్ రాష్ట్రంలోని ధోల్‌పూర్ ఏరియాలో ఈ దారుణం జరిగింది. తన కోర్కె తీర్చుకునేందుకు ఓ యువతిని చెరబట్టాడు. ఆమె ఎంతకీ లొంగక పోగా ఎదురుతిరిగింది. దీన్ని జీర్ణించుకోలేని ఆ కామాంధుడు ఆ వ్యక్తిని గొడ్డలితో నరికి చంపాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ధోల్‌పూర్ సమీపంలోని బసేది ప్రాంతానికి చెందిన ఓ 16 ఏళ్ల బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. దీన్ని గమనించిన అదే ప్రాంతానికి చెందిన విష్ణు ఠాకూర్‌ అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించాడు. బాలికను అత్యాచారం చేసేందుకు యత్నించాడు. బాలిక అతడిని అడ్డుకుని, చుట్టుపక్కల వారికి వినిపించేలా కేకలు వేసింది. 
 
దీంతో సదరు వ్యక్తి పక్కనే ఉన్న గొడ్డలితో బాలికపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ బాలిక అక్కడికక్కడే మృతిచెందింది. బాలిక కేకలు విన్న స్థానికులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని పట్టుకున్నారు. కాళ్లు చేతులు కట్టేసి దేహశుద్ధి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపంచనామాకు తరలించారు. ఆ తర్వాత కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.