శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 5 జులై 2018 (12:22 IST)

ఆ పబ్‌లో ఈశాన్య రాష్ట్రాల అమ్మాయిలతో "ఆ" నృత్యాలు.. ఎక్కడ?

బెంగుళూరులోని ఓ పబ్‌లో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలతో అసభ్యకర డ్యాన్స్‌లు వేయిస్తుండటాన్ని పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఈ డ్యాన్సుల్లో నిమగ్నమైన 32 మంది అమ్మాయిలను పోలీసులను రక్షించారు. అలాగే

బెంగుళూరులోని ఓ పబ్‌లో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలతో అసభ్యకర డ్యాన్స్‌లు వేయిస్తుండటాన్ని పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఈ డ్యాన్సుల్లో నిమగ్నమైన 32 మంది అమ్మాయిలను పోలీసులను రక్షించారు. అలాగే పబ్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే..
 
బెంగుళూరులోని ఇందిరానగర్‌లోనే అనేక పాపులర్ పబ్స్, నైట్ క్లబ్‌లు, రెస్టారెంట్లు ఉన్నాయి. అయితే ఓ పబ్‌కు చెందిన యాజమానులు అక్కడకు వచ్చిన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించసాగారు. అసభ్యకర దుస్తులను వేసుకునేలా ప్రేరేపించారు. అసభ్యకర నృత్యాలు కూడా చేసే విధంగా ప్రోత్సహించారు. 
 
ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు. దీనిపై పబ్ మేనేజ్‌మెంట్‌పై జీవన్‌భీమా నగర్ పోలీసులు కేసును నమోదు చేశారు. పబ్‌పై కేసు వేసిన విషయాన్ని ఈస్ట్ బెంగుళూరు డిప్యూటీ పోలీసు కమీషనర్ అజయ్ హిలొరీ తెలిపారు. ఉద్యోగులు ఇప్పిస్తామంటూ ఈశాన్య రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి డ్యాన్స్‌బార్ నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ఇందిరానగర్‌లోని 80 అడుగుల రోడ్‌లో ఉన్న మ్యాంగో ట్రీ బార్ నుంచి ఆ అమ్మాయిలను రక్షించారు. ప్రస్తుతం ఆ మహిళల్ని స్టేట్‌హౌమ్‌లో చేర్చారు. అరెస్టు చేసిన వారిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలోకి పంపారు.