గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : సోమవారం, 22 డిశెంబరు 2014 (14:44 IST)

మతమార్పిడిలను ప్రోత్సహించం: వెంకయ్య స్పష్టం

ఎట్టి పరిస్థితిలోనూ మతమార్పిడిలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. మతమార్పిడిలు లేదా మరోసారి మార్పిడిలకు కేంద్రం మద్దతు ఇవ్వబోదని సోమవారం ఆయన లోక్సభలో చెప్పారు.
 
అయితే మతమార్పిడిలను ఆపే బాధ్యత మాత్రం రాష్ట్రప్రభుత్వాల బాధ్యతేనన్నారు.  మతమార్పిడిలను ప్రోత్సహించే వారిపై రాష్ట్రాలు చర్య తీసుకోవాలని సూచించారు. మతమార్పిడిల వ్యవహారంపై ప్రధాని ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో ప్రభుత్వం తరపున తాను మాట్లాడుతున్నట్టు తెలిపారు.