తెలంగాణ సర్వేపై ఆరా తీసిన మోడీ: గవర్నర్తో భేటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో జరిగిన సమగ్ర సర్వేపై ఆరా తీశారు. ఢిల్లీలో గవర్నర్ నరసింహన్ భేటీ సందర్భంగా సర్వేపై మోడీ ఆరాతీసినట్లు తెలుస్తోంది. దాదాపు అర్ధగంట పాటు జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ సమగ్ర సర్వేపై మోడీ ఆరా తీసినట్లు సమాచారం.
హైదరాబాద్ శాంతిభద్రతలు, ఐఏఎస్ అధికారుల క్యాడర్ వర్గీకరణపై గవర్నర్-ప్రధానిల మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పరిస్థితులపై ప్రధానికి గవర్నర్ వివరించారు. రెండు రోజుల నుంచీ ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్న సంగతి తెలిసిందే.