గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 17 మార్చి 2017 (12:22 IST)

కదిలే కారులో కన్నతండ్రి ముందే.. అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్.. గుజరాత్‌లో ఘోరం..

గుజరాత్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న ఎస్‌యూవీ కారులో ఇద్దరు బాలికలను వారి కన్నతండ్రి ముందే.. గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు దుర్మార్గులు

నిర్భయ ఘటన దేశ వ్యాప్తంగా గతంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయినా కామాంధుల దాహానికి యువతులు బలైపోతున్నారు. కానీ కఠినమైన చట్టాలు మాత్రం అమల్లోకి రావట్లేదు. చట్ట సవరణలు జరగట్లేదు. దీంతో కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా గుజరాత్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న ఎస్‌యూవీ కారులో ఇద్దరు బాలికలను వారి కన్నతండ్రి ముందే.. గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు దుర్మార్గులు. 
 
వివరాల్లోకి వెళితే.. కుమత్ బరియా, గోప్ నిన్హ్ బరియా అనే ఇద్దరు భుట్‌పగ్లా గ్రామానికి చెందిన 13, 15 ఏళ్ల వయస్సున్న అక్కాచెల్లెళ్లపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. కుమత్‌బరియా కుమారుడు ఓ మద్యం కేసులో అరెస్టయ్యేందుకు బాలిక తండ్రే కారణమని.. దీంతో ఆగ్రహించే ఆయన కుమార్తెలపై ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు చెప్తున్నారు. 
 
గుజరాత్‌లోని దాహోద్‌ జిల్లా బరియా తహ్‌సిల్‌ దేవ్‌గఢ్‌లో ఈ ఘటన జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసులో ప్రమేయమున్న ఐదుగుర్ని అరెస్ట్ చేశారు.