గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2015 (15:37 IST)

గుజరాత్‌లో తీవ్రరూపం దాల్చిన కుల చిచ్చు... హోం మంత్రి ఇంటికి నిప్పు..

గుజరాత్‌లో చెలరేగిన కుల చిచ్చు తీవ్ర రూపందాల్చింది. పటేల్ కులస్థులను ఓబీసీ జాబితాలో చేర్చడంతో పాటు రిజర్వేషన్లు కల్పించాలంటూ రెండు రోజులుగా గుజరాత్‌లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. పటేళ్ళ ఆందోళనల కారణంగా ఇప్పటికి ఎనిమిది మంద్రి ప్రాణాలు కోల్పోయారు. ఆందోళనకారులు గురువారం ఆ రాష్ట్ర హోంమంత్రి రజని పటేల్ ఇంటికి  నిప్పుపెట్టారు. 
 
మెహ్‌సనా ప్రాంతంలో ఉన్న ఆయన ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టిన వెంటనే ఆర్పివేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చినట్లు పోలీసులు తెలిపారు. అదే సమయంలో  మంటల కారణంగా హోంమంత్రి ఇంటికి పెద్దగా నష్టం ఏమీ జరగలేదన్నారు. పటేళ్ళ ఆందోళన ఉద్రిక్త రూపం సంతరించుకున్న క్రమంలో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు భద్రతా దళాలు, పోలీసులు, సైన్యం ప్రయత్నిస్తున్నాయి. 
 
మరో వైపు శాంతియుతంగా ఉండాలని, ఆందోళనలు విరమించాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు. ఆందోళన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.