శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : శనివారం, 23 మే 2015 (09:35 IST)

బ్రిడ్జిపై పట్టాలు తప్పిన గౌహతీ ఎక్స్ ప్రెస్... త్రుటిలో తప్పిన ప్రమాదం

గౌహతీ ఎక్స్ ప్రెస్ శనివారం ఉదయం పట్టాలు తప్పింది. అదీ ఎక్కడో తెలుసా.. బ్రిడ్జీపైన. అయితే అప్పటికి పెద్దగా వేగం లేకపోవడం ప్రమాదం తప్పింది. కానీ రైలు పట్టాలు తప్పిన కారణంగా 20 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. 
 
గౌహతీ-సిప్ హుంగ్ ఎక్స్ ప్రెస్ శనివారం ఉదయం అస్సాంలోని కోక్రాజహార్, బాసుగౌన్ ప్రాంతంలో బ్రిడ్జి దాటుతున్న సమయంలో ఆకస్మాత్తుగా రైలు బోగీలు అదుపుతప్పాయి. ఈ ప్రమాదంలో  డ్రైవర్ సహా పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.
 
గౌహతీ-సిప్ హుంగ్ ఎక్స్ ప్రెస్ ఉత్తర బెంగాల్, అలీపురద్వర్ నుంచి బయలుదేరి గువహటి వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.