గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 19 సెప్టెంబరు 2015 (11:36 IST)

సూరత్‌లో హార్ధిక్ పటేల్ అరెస్టు : గుజరాత్‌లో మరోమారు ఉద్రిక్తత

పటేళ్ళ రిజర్వేషన్‌ కోసం పోరాటం చేస్తున్న యువనేత హార్ధిక్ పటేల్‌ను గుజరాత్ పోలీసులు సూరత్‌లో అరెస్టు చేశారు. దీంతో గుజరాత్ రాష్ట్రంలో మరోమారు ఉద్రిక్తతలకు దారితీసింది. గుజరాత్ రాష్ట్రంతో పాటు... దేశ వ్యాప్తంగా ఉన్న పటేల్ సామాజిక వర్గాన్ని ఓబీసీ వర్గంలో చేర్చాలని డిమాండ్‌ చేస్తూ గత కొంత కాలంగా ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. 
 
ఇందులోభాగంగా శనివారం ఏక్తా యాత్రకు పిలుపునిచ్చారు. అయితే శాంతిభద్రతల సమస్య వచ్చే అవకాశం ఉండటంతో.. గుజరాత్‌ సర్కార్‌ దీనికి అనుమతి నిరాకరించింది. అయినా పట్టువిడవని హార్ధిక్‌ పటేల్‌.. సూరత్‌లో సర్దార్‌ వల్లాబాయ్‌పటేల్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఏక్తా యాత్రను ప్రారంభించారు. పెద్దసంఖ్యలో మోహరించిన పోలీసులు.. యాత్రను అడ్డుకున్నారు. హార్ధిక్‌ పటేల్‌ సహా 78మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో గుజరాత్‌లో ఉద్రిక్తత నెలకొంది.