హార్దిక్ పటేల్ మిత్ర బృందంలో మోసగాడు.. రూ.కోటి ఎగనామం
పటేల్ సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చి యావత్భారతాన్ని తన వైపునకు తిప్పుకున్న యువ సంచలనం హార్దిక్ పటేల్. ఈ 23 యేళ్ల యువకుడి నేతృత్వంలో పటేల్ సామాజిక వర్గా రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తోంది. ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రం అట్టుడికి పోతోంది.
ఈ నేపథ్యంలో హార్దిక్ పటేల్ మిత్ర బృందంలో ఉన్న మిత్రుల్లో ఒకరు పచ్చి మోసగాడనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. హార్దిక్ పటేల్ మిత్రుల్లోని దినేశ్ పటేల్ అనే యువకుడు 2012లో ఇద్దరు జిన్నింగ్ మిల్లు వ్యాపారులకు రూ.కోటి మేర టోపీ పెట్టాడట. బాధితుల ఫిర్యాదుతో అప్పుడే దినేశ్ పటేల్పై పోలీసు కేసు కూడా నమోదైంది.
మరోవైపు.. హార్దిక్ పటేల్ చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఇప్పటికే బ్యాంకాక్ హోటల్లో విదేశీ వనితతో సరసాల్లో హార్దిక్ తేలియాడారని చెబుతూ విడుదలైన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనిపై పటేల్ సమాజికవర్గం పెద్దలు మండిపడుతున్నారు.