శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 27 మే 2016 (19:18 IST)

మా దాకా ఎందుకు...? అలాంటి వారిని మీరే కాల్చి చంపేయండి... హర్యానా డీజీపి సంచలనం

హర్యానా డీజీపి కేపీ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. నేరస్థులను, వేధింపులకు గురిచేసేవారిని సామాన్య మానవులు సైతం చంపేయవచ్చని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎవరైనా అమానుషంగా ప్రవర్తిస్తే పోలీసులకు మొరపెట్టుకోడం జర

హర్యానా డీజీపి కేపీ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. నేరస్థులను, వేధింపులకు గురిచేసేవారిని సామాన్య మానవులు సైతం చంపేయవచ్చని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎవరైనా అమానుషంగా ప్రవర్తిస్తే పోలీసులకు మొరపెట్టుకోడం జరుగుతుంది. 
 
ఐతే, వేధింపులకు గురి చేసే వారిపై కేసులు, గట్రా ఏమీ లేకుండా, అసలు తమ దాకా వచ్చేకంటే అక్కడే వారిని చంపేస్తే సరిపోతుందని హర్యానా డీజీపి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. తమను తాము కాపాడుకునే క్రమంలో వేధించేవారిని, నేరస్థులను హత్య చేసే హక్కు సామాన్య ప్రజలకు ఉంటుందంటూ ఆయన చెప్పుకొచ్చారు. మరి ఈ వాఖ్యలు ఎంతవరకు వెళతాయో...?