గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : బుధవారం, 15 ఏప్రియల్ 2015 (15:30 IST)

కట్నం కోరిన వరుడు.. 75 పైసలు జరిమానా విధించిన పంచాయతీ...!

ఆధునిక యుగంలో కోర్టులు, న్యాయవ్యవస్థ ఎంత బలిష్టమైనప్పటికీ కొన్ని ప్రాంతాలలో పంచాయతీ తీర్పే శాసనంగా మారుతుంటుంది. అటువంటి పంచాయతీ పెద్దలు తమకు అనుకూలమైన రీతిలో తీర్పును ఇస్తుంటారు. తాజాగా హర్యానా రాష్ట్రంలోని పంచాయతీ పెద్దలు కట్నం కోరిన వరుడికి 75 పైసలు జరిమానా విధించారు. 
 
హర్యానాలోని, ఫతేహాబాద్‌లో చోటు చేసుకుని ఆ సంఘటన పంచాయితీ వ్యవస్థల పనితీరుపై తీవ్ర ఆరోపణలను లేవనెత్తుతోంది. వివరాల్లోకి వెళితే, అడిగినంత కట్న కానుకలు ఇవ్వలేదన్న కోపంతో మగ పెళ్లివారు నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోగా, వధువు తరపు బంధువులు పంచాయితీ పెట్టారు. పెళ్ళికి ముందు వరుడికి కారు ఇవ్వాలని డిమాండ్ చేయగా, అందుకు వధువు తరపు పెద్దలు అంగీకరించలేదు. 
 
రెండు వైపులా వాదనలు విన్న పంచాయతీ పెద్దలు మగ పెళ్లివారిదే తప్పని తేల్చి, 75 పైసలు జరిమానాగా విధించారు. అంతే కాదు, ఆ మొత్తాన్ని అనాజ్ మండిలోని శివాలయ ధర్మశాలకు విరాళంగా ఇవ్వాలని తీర్పిచ్చారు.