శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 6 మే 2016 (16:18 IST)

సునంద పుష్కర్ మృతి కేసు: కొత్త ప్యానెల్ ఎంపిక.. క్షుణ్ణంగా దర్యాప్తు!

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శశి థరూర్ భార్య సునంద పుష్కర్ ఓ హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ప్రస్తుతం ఈ కేసుపై క్షుణ్ణంగా దర్యాప్తు జరిపేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త ప్యానల్‌‌ను నియమించింది. చండీగఢ్‌కు చెందిన ఇద్దరు వైద్యులు, పుదుచ్చేరి వైద్యులొకరు, ఢిల్లీలో లేడి హర్డింజ్ మెడికల్ కాలేజీ డాక్టర్ ఒకరు ఉన్నట్లు తెలిసింది.
 
ఈ కేసులో ఫోరెన్సిక్ సాక్ష్యాలను విశ్లేషించేందుకు కొత్తగా ఈ నలుగురితో కూడిన ప్యానెల్ పనిచేస్తుంది. ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్‌కు ఢిల్లీ పోలీసులు లేఖ రాయడంతో ఈ ప్యానెల్ నియామకం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఎఫ్‌బీఐ నుంచి వచ్చిన వైద్య నివేదికను కూడా పూర్తిగా పరిశీలిస్తారు. దర్యాప్తు సజావుగా జరిగేందుకు పోలీసులకు సహకరిస్తారు. 
 
ముఖ్యంగా ఏఐఐఎంఎస్ వైద్యులు కూడా సునంద పుష్కర్ మృతికి కారణాలను స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఈ కేసులో వివిధ ఏజెన్సీలు ఇచ్చిన నివేదికల్లో వైరుద్ధ్యాలున్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.