శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 18 సెప్టెంబరు 2014 (21:05 IST)

సవతి పోరు తట్టుకోలేక.. వేడి వేడి ఆయిల్‌పై దాడి!

సవతి పోరు తట్టుకోలేక.. ఓ మహిళ వేడి వేడి నూనెను సవతిపై పోసేసింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. శ్రవణ్ యాదవ్‌ అనే మగపురుషుడు బుద్ధి గడ్డితిని రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. మొదట సోను అనే యువతిని పెళ్ళి చేసుకున్న శ్రవణ్ ఆ తర్వాత ఆర్తి అనే మరో యువతిని కూడా పెళ్ళి చేసుకున్నాడు. తన ఇద్దరూ భార్యలూ అక్కా చెల్లెళ్ళలాగా కలసి మెలసి వుంటాడనుకున్న వాడికి చేదు అనుభవమే ఎదురైంది. 
 
తెల్లారిందంటే చాలు సోను, ఆర్తి జుట్టూ జుట్టు పట్టుకుని కొట్టుకుంటూ వుండేవారు. ఎందుకొచ్చిన గొడవ అని ఇద్దర్నీ వేరువేరు ఇళ్ళలో వుంచినా వీరి మధ్య గొడవలు తగ్గలేదు. బుధవారం ఆర్తి సోను ఇంటికి వేడివేడి నూనెతో వచ్చి సోనుమీద నూనెని పోసింది. వేడివేడి నూనె పడటంతో సోనుతోపాటు ఆమె కుమార్తె కూడా తీవ్రంగా గాయపడింది. సోను ఆర్తి మీద, భర్త శ్రవణ్ మీద కేసు పెట్టింది. ఇద్దరూ పరారీలో వున్నారు.