బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 28 అక్టోబరు 2016 (11:31 IST)

జయలలిత, కరుణానిధి, అఖిలేష్‌లకు చేతబడి చేశారు?.. ఓ జ్యోతిష్యుడి ఉవాచ

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అనారోగ్యం పాలు కావడానికి కారణం వారి ప్రత్యర్థులు చేతబడి చేయించడమేనని ఓ జ్యోతిష్యుడు చెప్పారు. ఈ మేరకు పలు వెబ్‌సైట్లలో వార్తలు హల

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అనారోగ్యం పాలు కావడానికి కారణం వారి ప్రత్యర్థులు చేతబడి చేయించడమేనని ఓ జ్యోతిష్యుడు చెప్పారు. ఈ మేరకు పలు వెబ్‌సైట్లలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అలాగే, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కుటుంబంలో చిచ్చురగలడానికి కూడా ఈ చేతబడులేనని పేరు ఇష్టపడని ఆ జ్యోతిష్యుడు చెప్పుకొచ్చాడు. 
 
కాగా, గత నెల 22వ తేదీన ఆస్పత్రిలో చేరిన జయలలిత ఇంకా చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే. అదేసమయంలో జయలలిత కోలుకుంటుండగా, ఇటీవలే కరుణానిధి కూడా అనారోగ్యానికి గురయ్యారు. ఈయన అనారోగ్యానికి కూడా కారణం ప్రత్యర్థుల చేతబడేనని, ఇందుకు విరుగుడు చేయిస్తే వారిద్దరూ కోలుకుంటారని సదరు జ్యోతిష్కుడు పేర్కొన్నాడట. 
 
ఇదిలావుంటే, యూపీ సీఎం అఖిలేష్ కుటుంబంలో రగిలిన చిచ్చుకు కూడా కారణం చేతబడేనని పుకార్లు సంచారం చేస్తున్నాయి. అఖిలేష్ ప్రత్యర్థులే ఈ చేతబడి చేయించారని, అందువల్లే ములాయం కుటుంబంలో తండ్రీ కొడుకులు సైతం శత్రువులుగా మారి కలహించుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ములాయం, అఖిలేష్‌లకు హాని కలిగించేందుకు తాంత్రిక ప్రయోగం జరుగుతోందంటూ ములాయం సోదరుడు రాంగోపాల్ ఆ మధ్య రాసిన ఒక లేఖను కొందరు ఉటంకిస్తున్నారు. ఈ క్రమంలో ములాయం రెండో భార్యపై కూడా ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే.