గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 24 జులై 2015 (19:28 IST)

కాశ్మీర్‌లో బ్యూటీపార్లర్లు మూసివేయాల్సిందే : ఉగ్ర సంస్థ హెచ్చరిక

కాశ్మీర్‌ ప్రజలకు ఉగ్రవాదులు ఓ హెచ్చరిక చేశారు. తక్షణం బ్యూటీపార్లను మూసివేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పుల్వామా జిల్లాలో హిజ్బుల్ పేరిట వెలిసిన కొన్ని పోస్టర్లు కలకలం రేపాయి. బ్యూటీ పార్లర్లు మూసివేయాలని, అనైతిక కార్యకలాపాలకు పాల్పడొద్దని ఆ పోస్టర్లలో హెచ్చరించారు. 
 
'కరీమాబాద్, నెవా, జదూరా, వాహిబుగ్, కలాన్ ప్రాంత ప్రజలు మద్యానికి, మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని, అనవసరమైన కార్యకలాపాలకు పాల్పడరాదని హెచ్చరిస్తున్నాం' అని ఆ పోస్టర్లలో పేర్కొన్నారు. ఆ పోస్టర్లపై హిజ్బుల్ లోగో కూడా ఉంది. బ్యూటీ పార్లర్ల వ్యాపారం నిలిపివేయాలని కూడా స్పష్టం చేశారు. కాగా, ఈ పోస్టర్లను హిజ్బుల్ ముజాహిదీన్ అనే తీవ్రవాద సంస్థ ముద్రించినట్టు తెలుస్తోంది.