శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 19 మే 2017 (10:03 IST)

40 యేళ్ళుగా తమిళనాడులో ఉంటున్నా.. నేను తమిళుడిని కాదా? రజనీకాంత్

తాను తమిళుడుకాదంటూ బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామితో పాటు పలువురు చేస్తున్న విమర్శలపై సినీ నటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. '40 ఏళ్లుగా తమిళనాడులోనే ఉంటున్నాను.. నేన

తాను తమిళుడుకాదంటూ బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామితో పాటు పలువురు చేస్తున్న విమర్శలపై సినీ నటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. '40 ఏళ్లుగా తమిళనాడులోనే ఉంటున్నాను.. నేను తమిళుడినే'నని స్పష్టంచేశారు. 
 
చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో తిరుచ్చి, అరియలూరు, తిరువళ్లూరు జిల్లాలకు చెందిన అభిమానులతో సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను పట్టించుకోనని ఆయన స్పష్టం చేశారు. విమర్శలు సర్వసాధారణమని ఆయన చెప్పారు. 
 
మన వ్యవస్థ (సిస్టమ్)లోనే లోపాలు ఉన్నాయన్నారు. చెడ్డ రాజకీయ నాయకులతోపాటు, నలుగురు మంచి నాయకులు కూడా ఉన్నారని ఆయన తెలిపారు. కాగా, అభిమానులతో ఐదో రోజు సమావేశమవుతున్న రజనీ... శుక్రవారం సాయంత్రంలోపు రాజకీయ రంగప్రవేశంపై ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు.