ఐఐఎంసీలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అవమానం: సమగ్ర దర్యాప్తుకు ఆదేశాలు
దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్స్ (ఐఐఎంసీ) హెచ్సీయూ బాటలోనే నడుస్తోంది. ఐఐఎంసీలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను అవమానపరిచేలా కామెంట్లు వినిపించాయి.
సోషల్ మీడియా వేదికగా ఐఐఎంసీలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అవమానం జరుగుతుందనే విషయం వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది. హెచ్సీయూ ఘటన నేపథ్యంలో కాస్తంగా వేగంగా స్పందించిన ఐఐఎంసీ అధికారులు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు.
కాగా రీసెర్చ్ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనతో హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో రోజుల తరబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు పర్యాయాలు వర్సిటీని సందర్శించారు. విద్యార్థులతో కలిసి ఉద్యమించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ యూనివర్శిటీలోనూ ఇదే తంతు కొనసాగడం సర్వత్రా చర్చనీయాంశమైంది.