గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 17 ఏప్రియల్ 2015 (12:40 IST)

అగ్ని-3 బాలిస్టిక్ క్షిపణి: 1.5 టన్నుల న్యూక్లియర్ వార్ హెడ్‌తో..

అణ్వస్త్ర సామర్థ్యంగల అగ్ని-3 బాలిస్టిక్ క్షిపణిని గురువారం భారత్ మూడోసారి విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని వీలర్ ఐలాండ్ నుంచి డీఆర్‌డీఓ నేతృత్వంలో సైన్యం ఈ పరీక్షను పూర్తిచేసింది.

ఉపరితలం నుంచి ఉపరితలంపై 3000 కి.మీ. దూరంలోపు లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణిని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌నుంచి ఉదయం 09.55 గంటలకు పరీక్షించినట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. 
 
అగ్ని-3లో రెండంచెల ఘన ఇంధన వ్యవస్థ ఉంటుంది. 17 మీటర్ల పొడవు, రెండు మీటర్ల వ్యాసం, 50 టన్నుల బరువు ఉండే ఈ క్షిపణి 1.5 టన్నుల న్యూక్లియర్ వార్‌హెడ్‌ను మోసుకుపోతుంది. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ఈ క్షిపణి ఇప్పటికే సైన్యం అమ్ములపొదిలోకి చేరింది.