బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 28 అక్టోబరు 2016 (12:20 IST)

కరెంట్ షాక్‌కు గురైన బాలిక.. ఆస్పత్రికి తరలించకుండా బురదలో పూడ్చిపెట్టి..?

కరెంట్ షాక్‌కు గురైన బాలికను ఆసుపత్రికి తరలించకుండా బురదలో పూడ్చి పెట్టిన వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మనుషులలో పేరుకుపోయిన మూఢనమ్మకాలను మాత్రం రవ్వంత కూడా తగ్గలేదు అనడానికి ఈ సంఘటనే ఉదాహరణ

కరెంట్ షాక్‌కు గురైన బాలికను ఆసుపత్రికి తరలించకుండా బురదలో పూడ్చి పెట్టిన వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మనుషులలో పేరుకుపోయిన మూఢనమ్మకాలను మాత్రం రవ్వంత కూడా తగ్గలేదు అనడానికి ఈ సంఘటనే ఉదాహరణ. పూర్తి వివరాలను పరిశీలిస్తే... 12 ఏళ్ల ముస్కన్ అనే అమ్మాయి మిద్దెపై ఆడుకుంటున్నప్పుడు హైటెన్షన్ వైరు తగిలి కరెంట్ షాక్‌కు గురై స్పృహ తప్పిపడిపోయింది. దీంతో ఆ అమ్మాయి కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆ బాలికను ఆసుపత్రికి తరలించకుండా ఓ బురద మడుగులో పూడ్చిపెట్టారు. 
 
ఊపిరిపీల్చేందుకు మాత్రం ఆమె ముక్కు మాత్రమే పైకి ఉంచి మిగతా శరీరమంతా బురదలోనే కప్పేశారు. అలా చేస్తే కరెంటు షాక్ వల్ల ఆమె శరీరంలోకి చేరిన చెడు శక్తులను భూమి పీల్చేసుకుంటుందని వారి నమ్మకమట. దీంతో ఆ బాలికను బురదలోనే ఉంచేశారు. బాలిక పరిస్థితి విషమించడంతో గ్రామస్థులు ఆమెను వెంటనే దగ్గర్లోని ప్రాథమిక కేంద్రానికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె కుడి కాలు, కుడి చేయి 90 శాతం కాలిపోయాయని వైద్యులు అన్నారు. ఈ సంఘటన తెలుసుకున్న ప్రతినిధులు వెంటనే ఇళ్లపై ఉన్న హైటెన్షన్ వైర్లను తొలగించాలని ఆదేశించారు.