శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (17:20 IST)

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎలుకల స్వైర విహారం.. ఈసారి మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో....

ఎలుకలు దేశంలోని ప్రభుత్వ ఆస్పత్రులను ఆవాసంగా మార్చుకుని, ముక్కుపచ్చలారని చిన్నారుల ప్రాణాలను హరిస్తున్నాయి. మొన్నటిమొన్న... గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలు కొరకడంతో చిన్నారి మృత్యువాత పడిన ఘటనను మరువకముందే అలాంటి సంఘటనే మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ధార్ జిల్లాలో జరిగింది. 
 
మూడు రోజుల క్రితమే జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకటిన్నర నెల వయస్సున్న పసికందుకు తీవ్ర అస్వస్థత చేయడంతో ఈ ఆ ఆస్పత్రిలోని ఐసీయు వార్డులో చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే, ఓ ఎలుక ఆ పసికందు ముక్కును కొరికేసింది. ఈ ఘటనపై అధికారులు సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు బాధ్యులనుచేస్తూ ఒక స్టాఫ్ నర్సును సస్పెండ్ చేయగా, కేర్ టేకర్‌ను విధుల నుంచి తీసేశారు.