శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 30 జూన్ 2015 (17:37 IST)

కట్నం పిశాచి.. స్థాయికి తగ్గ కట్నం కోసం ఐపీఎస్ అధికారి వేధింపులు..!

నాగరికత పెరిగినా, పెద్ద చదువులు చదువుకున్నా.. కొందరిని కట్నం పిశాచి వదలట్లేదు. స్థాయికి తగిన కట్నం ఇవ్వలేదని వివాహం జరిగిన రోజు నుంచీ  తన భర్త వేధిస్తున్నాడని ఐపీఎస్ అధికారి భార్య మెయిల్ ద్వారా పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. సాక్షాత్తూ డిప్యూటీ కమిషనర్‌పై ఫిర్యాదు రావడంతో కమిషనర్ దానిని డీజీపీ కార్యాలయానికి ఫార్వర్డ్ చేశారు. ఇదంతా తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగింది.  
 
చెన్నైలో ఐపీఎస్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న సదరు ఐపీఎస్, వివాహం జరిగిన నాటి నుంచి కట్నం కోసం తనను వేధిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి వేధింపులు తాళలేక, తాను ఇల్లు వదిలి వచ్చేశానని ఫిర్యాదులో ఐపీఎస్ అధికారి భార్య వెల్లడించారు. తన తొమ్మిదేళ్ల కుమారుడ్ని పోషించుకునేందుకు కళాశాల్లో చిన్నపాటి ఉద్యోగాలు చేయాల్సి వస్తోందని ఆమె చెప్పారు.