బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 30 జనవరి 2015 (13:14 IST)

బాబా రాందేవ్‌పై వివాదం: ఆ మందును వాడితే మగ బిడ్డలు!

యోగా గురు బాబా రాందేవ్‌పై మరోసారి వివాదం చెలరేగింది. బాబా రాందేవ్ పతంజలి ఫార్మసీ ద్వారా లభిస్తున్న ‘దివ్య పుత్రజీవక్ సీడ్' మందును వాడితే మగ బిడ్డలు పుట్టడం ఖాయమనే ప్రచారం దేశవ్యాప్తంగా జోరుగా సాగుతోంది.
 
ఈ మందుతో సంతాన సమస్యలు తొలగి, పండంటి మగబిడ్డ పుడతాడని రాందేవ్ నుంచి సందేశం వచ్చిందని రాందేవ్ మెడికల్ స్టోర్‌లో పనిచేస్తున్న డాక్టర్ శ్యాంసుందర్ తెలిపారు. ఈ మందు వల్లే తమకు మగబిడ్డ పుట్టాడని కొంతమంది వ్యక్తులు ఇతరులకు చెబుతున్నారన్నారు. 
 
పతంజలి మందుల దుకాణాల ద్వారా లభించే ఈ సహజసిద్ధ ఔషధం ప్యాకెట్ ధర రూ. 35 లేనట. హర్యానాలో ఈ మందుకు ఫుల్లుగా గిరాకీ ఉందట. ఆ రాష్ట్రానికి పంపిన మందు మొత్తం ఇప్పటికే సేల్ అదిరిపోతుందట.