శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 14 జనవరి 2017 (09:44 IST)

ముందు ఇష్టపూర్వకంగా సెక్స్.. ఆ తర్వాత డబ్బుకోసం... గ్యాంగ్ రేప్ డ్రామా...

రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌లో ఓ యువతి ఆడిన గ్యాంగ్ రేప్ డ్రామా తాజాగా వెలుగులోకి వచ్చింది. ముందుగా నలుగురు యువకులతో ఇష్టపూర్వకంగా సెక్స్ చేయించుకుని.. ఆ తర్వాత డబ్బుకోసం గ్యాంగ్ రేప్‌ డ్రామాకు త

రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌లో ఓ యువతి ఆడిన గ్యాంగ్ రేప్ డ్రామా తాజాగా వెలుగులోకి వచ్చింది. ముందుగా నలుగురు యువకులతో ఇష్టపూర్వకంగా సెక్స్ చేయించుకుని.. ఆ తర్వాత డబ్బుకోసం గ్యాంగ్ రేప్‌ డ్రామాకు తెరతీసింది. ఈ డ్రామాకు ఆ యువతి ప్రియుడు కూడా సహకరించడం గమనార్హం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
స్వాయి మధోపూర్ జిల్లా బజీర్‌పూర్ గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువతి పరీక్ష రాసే నిమిత్తం జైపూర్‌కు వచ్చింది. ఈమెకు సందీప్ లాంబా, బ్రిజేష్‌లతో పాటు నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జైపూర్ పోలీసులు యువతి ఫిర్యాదు మేర కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా దిమ్మతిరిగిపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. 
 
సదరు యువతి సందీప్ లాంబా అనే యువకుడితో కలిసి ఓ అద్దెగదిలో ఉంటూ ఏకాభిప్రాయంతో సెక్స్‌కు అంగీకరించిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆపై రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండు చేస్తూ యువకులను బ్లాక్ మెయిలింగ్ చేసింది. డబ్బు ఇచ్చేందుకు యువకులు నిరాకరించడంతో యువతి కాస్తా గ్యాంగ్ రేప్ కథకు తెర లేపిందని పోలీసులు తేల్చారు.
 
యువతి తన బాయ్ ఫ్రెండ్ అయిన రాంఫాల్ మీనాతో కలిసి ఈ గ్యాంగ్ రేప్ నాటకం ఆడిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ముందుగా సెక్స్‌కు అంగీకరించిన యువతి అనంతరం యువకులను బ్లాక్ మెయిల్ చేసేందుకు పురుగుల మందు తాగినట్లు నటించిందని పోలీసులు చెప్పారు. రాంపాల్ మీనాతోపాటు సదరు యువతి గతంలో ఫోర్జరీ, డబ్బు గుంజిన నేరాల్లో నిందితురాలని తేలింది. దీంతో పోలీసులు నిందితురాలైన యువతితోపాటు దీనికి సహకరించిన ఆమె బాయ్ ఫ్రెండ్‌లను అరెస్టు చేసి వారినుంచి ఆరు మొబైల్ ఫోన్లు, 15 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నామని జైపూర్ పోలీసు కమిషనర్ సంజయ్ అగర్వాల్ వెల్లడించారు.