శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 20 జనవరి 2017 (12:09 IST)

తమిళనాడులో శాంతిభద్రతలు అదుపుతప్పాయి.. కేంద్రం :: జల్లికట్టుపై తుది తీర్పు వాయిదా

తమిళనాడులో శాంతిభద్రతలు అదుపు తప్పాయని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. అందువల్ల జల్లికట్టుపై ఏదోఒక నిర్ణయం తీసుకోవాలని సూచన చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ అంశంపై పూర్తి స్థాయిలో చర్చలు

తమిళనాడులో శాంతిభద్రతలు అదుపు తప్పాయని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. అందువల్ల జల్లికట్టుపై ఏదోఒక నిర్ణయం తీసుకోవాలని సూచన చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ అంశంపై పూర్తి స్థాయిలో చర్చలు జరిగిన తర్వాతే తీర్పు వెల్లడించాలని కేంద్రం సుప్రీం కోర్టును కోరింది.
 
తమిళ సంప్రదాయ గ్రామీణ సాహసక్రీడ జల్లికట్టు పోటీలను సుప్రీంకోర్టు నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో ఈ పోటీల నిర్వహణకు అనుమతి కోరుతూ తమిళనాడు వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తం బంద్‌ను పాటిస్తున్నారు. ఇదే అంశంపై ప్రధాని మోడీతో సైతం తమిళనాడు పన్నీర్ సెల్వం సమావేశమయ్యారు. అయినా సమస్యకు పరిష్కారం లభించలేదు. 
 
ఈ నేపథ్యంలో.... జల్లికట్టు నిషేధంపై సుప్రీంకోర్టు శుక్రవారం వెల్లడించాల్సిన తీర్పును మరో వారం రోజుల పాటు వాయిదా వేసింది. తమిళనాడులో శాంతిభద్రతలు అదుపుతప్పుతాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసినా తుది తీర్పును వెల్లడించలేదు.