గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 19 అక్టోబరు 2014 (18:09 IST)

నా ప్రజా జీవితం నిప్పుల నదిలో ఈదడం వంటిది : జయలలిత స్టేట్మెంట్

అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష సుప్రీంకోర్టు బెయిలుతో కరుణ చూపడంతో శనివారం విడుదలైన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆదివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. తన ప్రజాజీవితాన్ని నిప్పుల నదిలో ఈదడంతో పోల్చుకున్నారు. ఇలాంటి కష్టాలు ఎదుర్కొనక తప్పదన్న విషయం తనకు ముందే తెలుసని పేర్కొన్నారు. 
 
అయితే, తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం తాను ఎంచుకున్న మార్గంలో కష్టాలు ఎదుర్కొనాల్సి రావడంపై తాను బాధపడడం లేదా చింతించడం లేదని ఆ ప్రకటనలో తెలిపారు. జీవితంలో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నానని, వాటిని విజయవంతంగా అధిగమించానని, భవిష్యత్‌లో కూడా అలానే అధికమిస్తాని ధీమా వ్యక్తం చేశారు. 
 
తన కష్టాలను చూసి కార్యకర్తలు, అభిమానులు ఆత్మహత్యలకు పాల్పడరాదని సూచించారు. తనకోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపారు. వారి ప్రార్థనలే తనను ఆదుకున్నాయని అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తన ప్రకటనలో పేర్కొన్నారు.