శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Updated : శనివారం, 1 అక్టోబరు 2016 (20:53 IST)

జయలలిత కోలుకుంటున్నారు... తమిళనాడు రాజ్ భవన్ నుంచి ప్రకటన విడుదల...

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై అంతకంతకూ ఆందోళన వ్యక్తమవుతున్న నేపధ్యంలో తమిళనాడు ఇన్ చార్జి గవర్నర్ సి.హెచ్ విద్యాసాగార రావు ఆమె ఆరోగ్యం గురించి ఓ ప్రకటన వెలువరించారు. ఆమె కోలుకుంటున్నారనీ, ఆమెకు చికిత్స అందిస్తున్న వైద్యులను ప్రశంసిస్తున్నట్ల

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై అంతకంతకూ ఆందోళన వ్యక్తమవుతున్న నేపధ్యంలో తమిళనాడు ఇన్ చార్జి గవర్నర్ సి.హెచ్ విద్యాసాగార రావు ఆమె ఆరోగ్యం గురించి ఓ ప్రకటన వెలువరించారు. ఆమె కోలుకుంటున్నారనీ, ఆమెకు చికిత్స అందిస్తున్న వైద్యులను ప్రశంసిస్తున్నట్లు చెప్పారు. దీనితో 40 గంటలుగా సాగుతున్న ఉత్కంఠకు తెర పడింది.
 
కాగా సెప్టెంబరు 22న చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అన్నాడీఎంకె కార్యకర్తలు అమ్మ కులాసాగా ఉన్నారంటూ ఆసుపత్రి గేట్లు వద్దకు వచ్చి మరీ చెప్తున్నారు.
 
ఇదిలావుంటే జయలలిత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుపుతూ ఫోటోలు విడుదల చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై అన్నాడీఎంకె పార్టీ స్పందిస్తూ... అమ్మ ఫోటోలు విడుదల చేయాల్సిన అవసరం లేదని కొట్టిపారేసింది. మరైతే భారీగా పోలీసుల పహారా అపోలో ఆసుపత్రి వద్ద ఎందుకు అనే ప్రశ్నలు కూడా కొందరు వేస్తున్నారు. మొత్తమ్మీద అమ్మ ఆరోగ్యం భేషుగ్గా ఉందని చెప్తున్నప్పటికీ ఆసుపత్రిలో ఆమె ఎలా ఉన్నారో ఫోటోలు విడుదల చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.