శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 22 మే 2015 (15:51 IST)

ముహూర్తం కుదిరింది.. రేపు ఉదయం 11 గంటలకు జయ ప్రమాణస్వీకారం..

అన్నాడీఎంకే పార్టీ అధినేత్రి జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రి కావడానికి ముహూర్తం కుదిరింది. ఆమె శనివారం ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. సుమారు 8 నెలల తర్వాత తొలిసారిగా శుక్రవారం రోజు ప్రజలకు దర్శనమిచ్చిన జయలలిత రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్యను కలిసి, తన మంత్రివర్గంలో ఉండబోయే మంత్రుల జాబితాను ఆయనకు సమర్పించారు.
 
సుదీర్ఘ కాలం తర్వాత పోయెస్ గార్డెన్స్ నుంచి బయటకు వచ్చిన జయలలితను చూసి అభిమానులు ఒక్క సారిగా 'అమ్మ తిరిగొచ్చింది' పెద్దగా నినాదాలు చేశారు. అనంతరం ఆమె నేరుగా ఎంజీఆర్ విగ్రహం వద్దకు వెళ్లి నివాళులర్పించారు. అనంతరం ఆమె గవర్నర్‌ను కలిసి తన జాబితాను ఆయనకు సమర్పించారు. శనివారం ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు రోశయ్యకు తెలిపారు.