గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 25 జులై 2014 (14:12 IST)

కమల్‌నాథన్ కమిటీ భేటీ ఓవర్: 2 రోజుల్లో వెబ్‌సైట్లో విధివిధానాలు!

ఢిల్లీలోని హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో కమల్‌నాథన్ కమిటీ సమావేశం శుక్రవారం ముగిసింది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన విధివిధానాలను రెండు రోజుల్లో వెబ్‌సైట్లో ఉంచనున్నారు. విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉద్యోగుల పంపిణీపై విధివిధానాలను కమల్‌నాథన్ కమిటీ ఖరారు చేసింది. 
 
ఇందుకు సంబంధించిన విధివిధానాలను రెండు రోజుల్లో వెబ్‌సైట్లో ఉంచుతామని కమిటీ తెలిపింది. విధివిధానాల పైన ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే పది రోజుల్లో తెలుపాలని కమిటీ తెలిపింది. 371డీ ప్రకారం స్థానికతను నిర్ధారిస్తామని కమిటీ పేర్కొందని తెలుస్తోంది. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన ఉంటుందని చెప్పింది. దంపతులు, ఒంటరి మహిళలకు మాత్రమే ఆప్షన్లు ఉంటాయని కమల్ నాథన్ కమిటీ పేర్కొన్నట్లు తెలుస్తోంది.