మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 8 జూన్ 2017 (12:06 IST)

మైనర్ బాలికపై తండ్రి అత్యాచారపర్వం.. పూజ పేరుతో మంత్రగాడు కూడా...

కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నకూతురుపై ఓ కిరాతక తండ్రి కన్నేశాడు. బాలికను బెదిరించి తన పశువాంఛను తీర్చుకుంటూ వచ్చాడు. అంతేనా ఓ మంత్రిగాడి వద్దకు తీసుకెళ్లగా అత

కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నకూతురుపై ఓ కిరాతక తండ్రి కన్నేశాడు. బాలికను బెదిరించి తన పశువాంఛను తీర్చుకుంటూ వచ్చాడు. అంతేనా ఓ మంత్రిగాడి వద్దకు తీసుకెళ్లగా అతను పూజ పేరుతో తన కోర్కెను తీర్చుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
బెంగళూరు మాగడి అజ్జనహళ్లికి చెందిన రమేశ్ దంపతులు 14 ఏళ్ల కూతురుతో కలిసి కూలిపనుల కోసం రాజగోపాలనగరకు వలస వచ్చారు. కూలిపని లేనిరోజుల్లో ఇంట్లోనే ఉండే రమేశ్‌కు మైనర్‌ కూతురుపై వ్యామోహం పెరిగింది. తల్లితో చెబితే చంపేస్తానంటూ పాపను బెదిరించి తన కామ కోర్కెలు తీర్చుకుంటూ వచ్చాడు. 
 
తన తండ్రి చేస్తున్న పనులను బయటపెడితే తల్లిని చంపేస్తాడన్న భయంతో బాలిక ఈ ఘోరాన్ని మౌనంగానే భరిస్తూ వచ్చింది. ఇలా తండ్రి ప్రవర్తన హద్దులుదాటడంతో తీవ్ర ఆవేదనకు గురైన బాలిక తండ్రి నీచాన్ని తల్లితో మొరపెట్టుకుంది. అయితే ఆ తల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయకుండా లగ్గెరెలోని చౌడేశ్వరినగరలో ఉన్న సోదరి ఇంటికి తీసుకెళ్లి స్థానికంగా ఉండే మంత్రగాడు మల్లేశ్‌ వద్దకు బాలికను పిలుచుకెళ్లారు. 
 
అతడు బాలికపై అత్యాచారం జరిగిందా? లేదా? అనేది పరీక్షించడానికంటూ ఒక తతంగం రూపొందించాడు. ఈ తతంగం పేరుతో దొంగస్వామి కూడా తన కామవాంఛ తీర్చుకున్నాడు. ఈ విషయం ఇరుగుపొరుగు వారి నుంచి తెలుసుకున్న స్థానికులు కామాంధుడు రమేశ్, అతడి భార్యను, మల్లేశ్‌‌ను పట్టుకొని బుధవారం రాజగోపాలనగర పోలీసులకు సమాచారం అందించారు. తక్షణం ఘటనాస్థలానికి చేరుకున్న రాజగోపాలనగర పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి విచారణ చేపడుతున్నారు. బాలికను సంరక్షణ కేంద్రానికి తరలించారు.